ప్రకాశం: గుడ్లూరు మండలంలో బాల్యవివాహం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 7వ తరగతి చదువుతున్న బాలికకు 9వ తరగతి చదువుతున్న బాలుడికి పెద్దలు వివాహం జరిపించారు. విషయం వెలుగులోకి రావడంతో మైనర్లను ఒంగోలు బాల సదన్కు తరలించి, వివాహం చేసిన పెద్దలపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు.