MNCL: జన్నారం మండలంలోని రైతులు పంటల రక్షణకు దృష్టి పెట్టాలని మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మార్చి 16-20 తేదీల మధ్యలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, బలమైన ఉరుములు, మెరుపులు పిడుగులు, ఈదురుగాలులు, వడగళ్ల వానలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించిందన్నారు. పంటల రక్షణకు దృష్టి సారించాలని కోరారు.