NLG: నిరుద్యోగ యువతీ, యువకుల కోసం వివిధ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారిని పద్మ తెలిపారు. ఎంపికైన వారు నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుందని, నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు. టెన్త్-డిగ్రీ వారు అర్హులని వెల్లడించారు.