SKLM: సోంపేట పట్టణంలోని పల్లె పుష్కరిణి కార్యక్రమంలో భాగంగా రామ సాగరం చెరువు సుందరీకరణ పనులకు ఇచ్చాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అశోక్ బాబు హాజరై శనివారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. రూ.50 లక్షలతో చేపట్టనున్న ఈ సుందరీకరణ పనులు పూర్తయితే చెరువు పరిసర ప్రాంతం అందంగా మారుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.