MNCL: మంచిర్యాలలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా కాసేపు బ్యాట్ పట్టి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. నిత్య జీవితంలో వ్యాయామం ఒక భాగంగా ఉండాలని, శారీరక శ్రమతోనే ఆరోగ్యం సాధ్యమని పేర్కొన్నారు. క్రీడా పోటీలు ఉద్యోగుల్లో పని ఒత్తిడిని తగ్గిస్తాయని తెలిపారు.