MHBD: గూడూరు మండలం గన్యచకృ తండాకి చెందిన భార్యభర్తలు హైదరాబాదులో హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం వారి చిన్న కూతురు వసంతకు తెలియదు. విషయం తెలిస్తే ఈరోజు జరిగే పదో తరగతి పరీక్షపై ప్రభావం పడుతుందని స్థానికులు ఆమె దగ్గర విషయాన్ని దాచారు. పరీక్ష పూర్తైన అనంతరం ఆమెకు విషయాన్ని చెప్పడంతో కన్నీరు మున్నీరైంది.