కడప: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు 144 సెక్షన్ అమలు చేసి, సెంటర్ల వద్ద పోలీసు సిబ్బందిని నియమించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.