NLG: చిట్యాలలో పదవ తరగతి పరీక్షలు అత్యంత పకడ్బందీగా కొనసాగుతున్నాయి. విద్యాశాఖ, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, ప్రతి సెంటర్ వద్ద హెల్ప్ లైన్ నంబర్లను అధికారులు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.