PPM: జిల్లాలో నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం సివిక్స్ పరీక్షకు 164మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాధికారి నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ 1624 మందికి గాను 163 హాజరు కాలేదన్నారు. జనరల్ బ్రిడ్జ్ విభాగంలో 1 విద్యార్థికి అతను హాజరు కాలేదు అని ఆయన వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, నిబంధనల ప్రకారం పకడ్బందీ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.