TG: డిండి ఎత్తిపోతల పథకంపై నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య వివాదం చెలరేగింది. డిండి ప్రాజెక్టు నీటి సేకరణపై నల్గొండ రైతుల్లో ఆందోళన నెలకొంది. పాలమూరు ప్రాజెక్టును 436 మీటర్ల ఎత్తునుంచే నీరు తరలించాలని ప్రభుత్వం భావించింది. ఈ డిజైన్ అమలు చేస్తే 8 టీఎంసీలకే డిండి ప్రాజెక్టు పరిమితం కానుంది. దీంతో దిద్దుబాటు చర్యలకు రేవంత్ సర్కార్ ఉపక్రమించింది.