TG: యుద్ధం వల్ల అనేక దేశాల్లో గ్యాస్ ధరలు పెరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు తెలిపారు. మన దేశంలో మాత్రం గ్యాస్ ధరలు పెరగలేదని చెప్పారు. సామాన్యుడికి ఇబ్బందులు లేకుండా మోదీ ప్రభుత్వం గ్యాస్ ధరలను నియంత్రణలో పెట్టిందన్నారు. కొంతమంది దళారులు గ్యాస్ కొరతను కావాలనే సృష్టిస్తున్నారని విమర్శించారు.