BDK: ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఏ-గ్రేడ్ సాధించాలని ఐటీడీఏ పీవో బి. రాహుల్ ఆకాంక్షించారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే గిరిజన విద్యార్థులు మనసులో ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. గిరిజన విద్యార్థులందరూ ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.