BHNG: తండ్రి చనిపోయిన దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ఓ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. మోత్కూర్కు చెందిన ఉపాధ్యాయుడు కూరెళ్ళ ఎల్లయ్య శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. పదవ తరగతి చదువుతున్న అతని కుమారుడు కూరెళ్ళ హర్షవర్ధన్, తండ్రి మరణంతో దుఃఖంలో మునిగిపోయిన కన్నీళ్ళను దిగమింగుకుని పరీక్ష రాయడం చూపరులను కలచివేసింది.