SKLM: ఉమ్మడి ఏపీ మాజీ DGP హెచ్.జే దొర ఆకస్మిక మృతి పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం దిగ్భ్రాంతిని ప్రకటించారు. ఆయన మరణ వార్త తనను అమితంగా కలచివేసిందని అన్నారు. 1965 బ్యాచ్ IPS అధికారి అయిన దొర నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారి అని కొనియాడారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని కేంద్ర మంత్రి తెలిపారు.