ATP: మహిళా భద్రత, పోక్సో చట్టంపై అవగాహన కల్పించేందుకు మంజునాథ్ అనే వ్యక్తి హిందూపురం నుంచి అమరావతి వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోని మిడుతూరుకు చేరుకోగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొంకరి కమలమ్మ ఆయనను కలిసి అభినందించారు. సమాజంలో బాలికలు, మహిళల రక్షణపై చైతన్యం తెచ్చే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు.