SKLM: కూటమి ప్రభుత్వంలో “అన్నదాత సుఖీభవ” పథకం ద్వారా రైతులకు అన్యాయం జరుగుతోందని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి శేఖర్ రావు ఆరోపించారు. శుక్రవారం రాత్రి నరసన్నపేటలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో 53 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందగా, ప్రస్తుతం ప్రభుత్వంలో 46 లక్షల మందికి మాత్రమే ప్రయోజనం కల్పిస్తున్నారని అన్నారు.