SDPT: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో సివిల్ సప్లైస్ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన సదస్సు DSO తనుజ అధ్యక్షతన జరిగింది. మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేసే ముందు తయారీ తేదీ, గడువు తేదీ పరిశీలించాలని సూచించారు. చైతన్యంతోనే మోసాలను నివారించవచ్చని తెలిపారు. ఆహార పదార్థాల్లో కల్తీ, తూకాల్లో మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.