KNR: పశ్చిమాసియా యుద్ధం వల్ల తలెత్తిన ఎల్పీజీ కొరత ప్రభావం విద్యా సంస్థలపై పడకుండా చూడాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లకు వంటగ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో భోజనం అందేలా చూడాలన్నారు.