PDPL: రామగుండం మేయర్ మహంకాళి స్వామి ఇవాళ కార్పొరేషన్ పరిధిలోని 3, 48, 49 డివిజన్లలో పర్యటించారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్రక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.