KDP: పులివెందుల పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్లో ఖాళీగా ఉన్న షాపులను బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ శుక్రవారం తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు రూ. 100 చెల్లించి దరఖాస్తు ఫారం పొందవచ్చన్నారు. దరఖాస్తును 16వ తేదీన 2 గంటలలోపు మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. 16వ తేదీ 2 గంటల తరువాత వేలంపాట నిర్వహిస్తామన్నారు.