NGKL: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ మండలంలోని మంతటి గ్రామ సమీపంలో జరుగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశాన్ని స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.