HYD: సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఫిబ్రవరిలో 74 కేసులకు సంబంధించి 117 మందిని అరెస్ట్ చేసినట్లు అదనపు సీపీ శ్రీనివాసులు తెలిపారు. నిందితులందరినీ 16 రాష్ట్రాల్లో గాలించి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. గతనెలలో అరెస్టైన 117 మందిపై దేశంలోని వివిధ ఠాణాల్లో నమోదైన 1,081 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.