NLG: క్లాస్ రూంలు, పుస్తకాలతో కుస్తీ పట్టిన ఇంటర్ విద్యార్థులకు కాస్త ఉపశమనం లభించనుంది. గురువారంతో ఫస్టియర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఒక్కసారిగా పరీక్షా కేంద్రాల వద్ద సందడి చేశారు. ప్రథమ సంవత్సర పరీక్షలు ముగియగా, నేడు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు చివరి పరీక్ష జరగనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా వార్షిక పరీక్షల పర్వం పూర్తికానుంది.