HYD: ఖైరతాబాద్ RTA కార్యాలయం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం పాటలో నంబర్ల కోసం వాహనదారులు భారీగా పోటీ పడ్డారు. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ.31,14,730 ఆదాయం లభించింది. ఈ మేరకు TG 09 L 0009 ఈ నంబర్ అత్యధిక ధర పలికింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ ఏకంగా రూ.10,50,000 వెచ్చించి దీనిని దక్కించుకుంది.