JGL: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు రాయికల్ మండలంలోని అల్లిపూర్ విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం పొరండ్ల కిరణ్, పీడీ కృష్ణ ప్రసాద్ తెలిపారు. అండర్-14 విభాగంలో 60 మీటర్ల పరుగులో మణితేజ, అండర్-20 విభాగంలో విశ్వేశ్ ప్రథమ స్థానం సాధించారన్నారు. ఈనెల 15న హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారన్నారు.