ELR: పోలవరం మండలం గాజులగొందిలో ఐదేళ్ల గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. 2018 ఏప్రిల్లో ఆడుకుంటున్న చిన్నారిని మభ్యపెట్టి అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నమోదైన ఈ కేసులో విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో, ఉమ్మడి జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి వాణి గురువారం తీర్పు వెలువరించారు.