AP: అనకాపల్లి జిల్లా పెందుర్తి మండలంలో కొండచిలువల కలకలం రేగింది. స్థానిక పెదముషిడివాడలోని వాటర్ పైపుల నిర్మాణ స్థలంలో 6 కొండచిలువలు కనిపించాయి. ఇందులో 2 కొండచిలువలు JCB తగిలి మృతిచెందగా.. మిగిలిన నాలుగింటిని సిబ్బంది అడవుల్లో వదిలేశారు. ఒకేసారి 6 కొండచిలువలు కనిపించడంతో ఎక్కడి నుంచి వచ్చాయో, నిర్మాణ స్థలంలో ఇంకా ఏమైనా ఉన్నాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.