ప్రకాశం: పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. మార్కాపురం జిల్లాలోని 1,52,190 రైతులకు రూ.87.50 కోట్లు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి బాలాజీ నాయక్ తెలిపారు. నగదు రైతుల ఖాతాలో జమ కానుందన్నారు. గిద్దలూరు-రూ.21.71 కోట్లు, కనిగిరి-రూ.24.30 కోట్లు, మార్కాపురం-రూ.19.05 కోట్లు, ఎర్రగొండపాలెం-రూ.22.45 కోట్లు మంజూరయ్యాయన్నారు.