MLG: మల్లంపల్లి మండల కేంద్రంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. శివం గార్డెన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వేగంగా వస్తున్న ఇసుక లారీ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.