కోనసీమ: పి. గన్నవరం మండలంలోని లంకల గన్నవరం గ్రామం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయ పునఃనిర్మాణానికి గ్రామానికి చెందిన ప్రముఖ సిద్ధాంతి బులుసు శ్రీరామ శర్మ సిద్ధాంతి కుటుంబసభ్యులు రూ.1,10,232 విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పునఃనిర్మాణ కమిటీ సభ్యులు దాతలను సత్కరించారు.