PDPL: జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిని కాలిందిని ఇవాళ ముత్తారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముచ్చటించి, విద్యా బోధన, వసతి, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.