KNRL: వెల్దుర్తి మండలం మల్లేపల్లిలో శుక్రవారం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ మూడో విడత నిధుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు హాజరుకానున్నారు. మండలంలోని 10,679 మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.6.30 కోట్లు జమ చేయనుంది. రైతు సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.