GDWL: ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో 40 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 8,110 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. ఇందులో బాలికలు 4,199 మంది బాలురు, 3,858 మంది, 53 మంది ఒకసారి విఫలమైన విద్యార్థులు ఉన్నారని తెలిపారు.