VSP: ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏయూ ఈఈటీ-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విషయాన్ని ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ. నాయుడు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులను మార్చి 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్వీకరిస్తారన్నారు. సాధారణ అభ్యర్థులు రూ.1,200, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.1,000 పరీక్ష రుసుము చెల్లించాలన్నారు.