సత్యసాయి: జిల్లాలో పదో తరగతి, ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్షలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు 22,303 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 107 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని, 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు.