NZB: అత్యవసర మరమ్మతుల నేపథ్యంలో ఇందల్వాయి రైల్వేగేట్ ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గేట్ మూసివేయనున్నట్లు చెప్పారు. ఇందల్వాయి నుంచి ధర్పల్లి, సిరికొండ, భీమ్గల్ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు డిచ్పల్లి, కమలాపూర్, తిర్మన్పల్లి మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని అధికారులు సూచించారు.