SKLM: జిల్లాలో ప్రయాణించే 3 రైళ్లకు రైల్వే శాఖ కొత్త హల్ట్లను మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ ఓ ప్రకటనలో తెలిపారు. గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ హరిశ్చంద్రపురం వద్ద, బెరహంపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ మందస రోడ్ వద్ద, రాజ్యరాణి ఎక్స్ప్రెస్ పాతపట్నం వద్ద ఆగనున్నాయన్నారు. ఈహల్ట్లతో జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.