KMM: తక్కువ ప్రీమియంతో ప్రభుత్వం కల్పిస్తున్న ఇలాంటి బీమా పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని డీసీసీబీ బ్రాంచ్ సిబ్బంది సూచించారు. తల్లాడ డీసీసీబీ బ్రాంచ్లో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) కింద లబ్ధిదారుని కుటుంబానికి రూ. 2,00,000 చెక్కును బ్యాంకు అధికారులు నేడు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.