NGKL: పెద్దకొత్తపల్లి మండలంలోని యాపట్ల గ్రామంలో శ్రీ ఆంజనేయ ఆలయం ఎదుట ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. గ్రామంలో ఏ వీధి చూసిన బంధువులతో కిక్కిరిసిపోయాయి. గుడి ప్రాంతమంతా భక్తి పరవశంతో మునిగిపోయింది.