SDPT: ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని సిద్దిపేట నియోజకవర్గ ఇంఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. గురువారం అర్బన్ మండలం తడకపల్లిలో ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఉపాధి కూలీల పని దినాలు తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.