BHPL: భూపాలపల్లి జిల్లా రజక సంఘం నూతన అధ్యక్షుడిగా మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన అయితు బాపు నియామకం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పూసల సంపత్ బుధవారం వారికి నియామక పత్రాన్ని అందజేశారు. వారి ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రజక సంఘం నేతల సమస్యలపై పోరాడుతానని సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని బాపు అన్నారు.