టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో ‘నారీనారీ నడుమ మురారి’ మూవీ రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను శర్వా పూర్తి చేశాడు. ఇక దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య నటించారు. 2026 జనవరి 14న ఇది రిలీజ్ కానుంది.