TPT: లక్కీడిప్ టోకెన్లతో వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం నేటి రాత్రి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆక్టోపస్ సర్కిల్ నుంచి క్యూ లైన్ ఏర్పాటు పూర్తి చేశారు. రద్దీని బట్టి సాయంత్రం నుంచే క్యూలోకి అనుమతి ఇవ్వవచ్చు. CRO వద్ద గదులు అందుబాటులో ఉంటాయి.