KNR: గన్నేరువరం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు తిప్పర్తి నికేశ్ ఆధ్వర్యంలో మండల సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 14న ఉదయం 6 గంటలకు మహాశక్తి దేవాలయం కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొంటారని తెలిపారు.