ADB: బెజ్జూర్ మండలంలోని సులుగుపల్లి గ్రామ సర్పంచ్ చిన్నయ్య, ఉప సర్పంచ్ గోవర్ధన్, పలువురు బీఆర్ఎస్ నాయకులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, MLC విటల్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.