ప్రకాశం: రాచర్ల మండలం సోమీదేవిపల్లిలో మిరప పంటను ఉద్యాన శాఖ అధికారి శ్వేత బుధవారం పరిశీలించారు. మిరప పంటలో తామర పురుగు, మిగతా రసం పీల్చే పురుగుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. కొత్తగా నాటిన మిరపలో ఫీప్రోనిల్ గుళికలను ఎకరానికి ఎనిమిది కిలోల చొప్పున చల్లుకోవడం వల్ల తామర పురుగు 45 రోజుల వరకు పంటను ఆశించకుండా నివారించవచ్చని అన్నారు.