NZB: వర్ని మండల కేంద్రమైన సత్యనారాయణపురం గ్రామపంచాయతీలో చెత్త సేకరణ కోసం నూతన ఆటోలను కొనుగోలు చేశారు. 9 లక్షల వ్యయంతో వీటిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. మేజర్ గ్రామపంచాయతీ అయిన సత్యనారాయణపురంలో ఇంటింటా చెత్త సేకరించడానికి వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. మంగళవారం ఆటోలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రెడ్డి రాంబాబు పాల్గొన్నారు.