ATP: రాయదుర్గంలో ఖాళీగా ఉన్న 28 ఉపాధ్యాయ పోస్టులను అకాడమిక్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ భర్తీ చేయనున్నట్లు ఎంఈవో-1 మొహమ్మద్ ఇర్షాద్ బుధవారం మీడియాకు ఓ ప్రకటనలో తెలిపారు. SGTలకు రూ. 10వేలు, స్కూల్ అసిస్టెంట్లకు రూ. 12,500 గౌరవ వేతనం అందజేస్తామన్నారు. సంబంధిత పోస్టులకు బీఎడ్, డీఎడ్తోపాటు టెట్ క్వాలిఫై అయి ఉండాలన్నారు. ఈనెల 5లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు.