TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 72,526 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 26,664 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 4.41 కోట్లు నమోదైంది. ప్రస్తుతం 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా, సర్వదర్శనానికి సుమారు 12-15 గంటల సమయం పడుతోంది.