తన భర్త, నటుడు ధర్మేంద్ర మరణాన్ని తలుచుకుంటూ హేమ మాలిని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘నా జీవితంలో అన్నీ ధర్మేంద్రనే. నా కష్టసుఖాల్లో తోడున్నాడు. ఆయన కీర్తి ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. కానీ వ్యక్తిగతంగా ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆ బాధ వర్ణించలేనిది. ఆయనతో కలిసి జీవించిన క్షణాలు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. లెక్కలేనన్ని జ్ఞాపకాలు ఇచ్చారు’ అని పేర్కొంటూ ఫొటోలు పంచుకుంది.